ట్విట్టర్ దీవాలి ఎమోజీ ఈ నెల 28 నుండి నెటిజన్లకు అందుబాటులో
- October 26, 2016
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ ఈ ఏడాది దీపావళి ఎమోజీ ఏది పెట్టాలనే నిర్ణయంపై నెటిజన్ల అభిప్రాయాలను కోరింది. ప్రతి పండుగ సమయంలో ట్విట్టర్నెటిజన్లకు శుభాకాంక్షలు చెబుతూ వారిని ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా ఎమోజీని ఏర్పాటు చేస్తోంది. అలాగే ఈ ఏడాది దీపాల పండుగ సందర్భంగా ఎమోజీని పెట్టేందుకు ప్రజల అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని కోరింది. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములై వారి నిర్ణయాలను తెలియజేయాలని ట్విట్టర్ ఇండియా పేర్కొంది. గతేడాది దీపావళి సందర్భంగా ట్విట్టర్ ప్రత్యేక దీపావళి ఎమోజీని ప్రవేశపెట్టింది. హ్యాష్ట్యాగ్తో హ్యాపీ దీపావళి అని పెట్టినప్పుడు దాని పక్కన ఈ ఎమోజీ వచ్చింది.
చెడుపై మంచి విజయానికి ప్రతీకగా, చీకటికి తొలగించే కాంతిగా, అసత్యంపైన నిజం గెలుస్తుందనే దానికి ప్రతీకగా దీన్ని పెడుతున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఆరెంజ్, గ్రీన్, పింక్, బ్లూ రంగుల్లో ఏది దీపానికి పెట్టాలి అనే దానిపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. దీనిపై మంగళవారం నుంచి ఓటింగ్ ప్రారంభంకాగా 48 గంటల్లో ముగుస్తోంది. ఎక్కువ మంది ఏ రంగు పెట్టాలని నిర్ణయిస్తారో దాన్నే ఈ ఏడాది దీపావళి ఎమోజీ కింద పెడతామని తెలిపింది.
ఈనెల 28 నుంచి ఈ ఎమోజీ నెటిజన్లకు అందుబాటులోకి రానుంది. గతంలో స్వాతంత్య్ర దినోత్సవం, గణేశ్ చతుర్థి, మేక్ ఇన్ ఇండియా తదితర సమయాల్లో ప్రత్యేక ఎమోజీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







