నవంబర్ 10న అనంతపురంలో జనసేన బహిరంగ సభ
- October 26, 2016
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో సభ ఖారారైయింది. నవంబర్ 10న అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ ఏర్పాటు చేయనుంది జనసేన. పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఈ సభలో మరోసారి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా, హక్కులపై పై కేంద్రాన్ని నిలదీయనున్నారు. దీనికి సంబంధించి జనసేన ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అయితే ఇప్పుడీ సభకు పేరును మార్చించింది జనసేన. గత రెండు సభలు 'సీమాంద్రల ఆత్మ గౌరవ'సభ పేరుతొ జరిగిన సంగతి తెలిసిందే. ఐతె నవంబర్ 10న అనంతపురంలో తలపెట్టిన బహిరంగ సభకుమాత్రం 'సీమాంధ్ర హక్కుల చైతన్య'సభగా పేరు పెట్టారు పవన్ కళ్యాణ్.
అలాగే, సభా ప్రాంగణానికి విప్లవ నేత తరిమెల నాగిరెడ్డి, సభా వేదికకు స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు పేర్లను ఖరారు చేసినట్లు తాజా ప్రకటనలో తెలిపారు.
అనంతపురం జిల్లాలో పుట్టి రాష్ట్రానికి, ఈ దేశానికి అపార సేవలందించిన మహనీయులు నాగిరెడ్డి, సుబ్బారావులను ఈ సందర్భంగా స్మరించుకోవడం జనసేనకు కలిగిన భాగ్యంగా చెప్పుకొచ్చారు పవన్. నవంబర్ 10 సాయంత్రం 4గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ సభ జరుగనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







