మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బహుమతులే బహుమతులు
- October 26, 2016
మస్కట్: ప్రముఖ జ్యుయెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, వినియోగదారులకు అనూహ్య రీతిలో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 19 నుంచి ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ అద్భుతంగా కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే 25,000 గోల్డ్ కాయిన్స్ వినియోగదారులు గెల్చుకున్నారు. తాజాగా అన్వర్ అలీ అనే వ్యక్తి 500 గోల్డ్ కాయిన్స్ గెలుచుకున్నారు. 250 ఒమన్ రియాల్స్ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేవారికి, బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. 500 ఒమన్ రియాల్స్తో డైమండ్ జ్యుయెలరీని కొనుగోలు చేస్తే ఖచ్చితంగా వారికి 2 గ్రాముల గోల్డ్ కాయిన్ గెలుచుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 28 వరకు పలు రకాలైన ఆఫర్లను సంస్థ ప్రకటించింది. వీటితోపాటుగా గోల్డ్ జ్యుయెలరీ ఎక్స్ఛేంజ్పై సున్నా శాతం డిడక్షన్ కూడా ఉంటుంది. గోల్డ్ జ్యుయెలరీ మాన్యుఫ్యాక్చరింగ్లో తాము అత్యున్నత స్థానంలో ఉన్నామని, వినియోగదారుల ఆదరాభిమానాలతో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









