యూఏఈ బిలియనీర్ చేతికి 'రెమిట్ టు ఇండియా'
- October 26, 2016
యూఏఈ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిలియనీర్ బిఆర్ శెట్టికి చెందిన గ్లోబల్ రెమిటీ సంస్థ యూఏఈ ఎక్స్ఛేంజ్, ఇండియాకి చెందిన రెమిటీ టు ఇండియా సంస్థను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలియవస్తోంది. టైమ్స్ ఆఫ్ మనీ నుంచి ఈ సంస్థను సొంతం చేసుకుంది బిఆర్షెట్టికి చెందిన యూఏఈ ఎక్స్ఛేంజ్. 2000 సంవత్సరంలో రెమిట్ టు ఇండియా ఏర్పాటయ్యింది. 500,000 మందికి వైగా వినియోగదారులతో (ఎక్కువమంది వలసదారులే) అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా వర్ధిల్లుతోంది. యూఎస్, కెనడా మరియు ఆస్ట్రేలియాకి చెందిన వినియోగదారులే ఎక్కువ ఈ సంస్థకి. వినియోగదారులకు నమ్మకమైన రెమిటెన్సీ సర్వీసులు అందించడం ద్వారా అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది రెమిట్ టు ఇండియా. యూఏఈ ఎక్స్ఛేంజ్ గ్రూప్ సీఈఓ ప్రమోద్ మంగాత్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సరికొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయనీ, ఈ తాజా అవకాశంతో తమ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని అన్నారు. రెగ్యులేటరీ అప్రూవల్స్ని బట్టి 2017 తొలి క్వార్టర్లో డీల్ క్లోజ్ కానున్నట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







