ఫ్రీ ట్రాన్సిట్ వీసా ఆన్ అరైవల్ అతి త్వరలో
- October 26, 2016
కొత్త ట్రాన్సిట్ వీసా స్కీమ్ని అతి త్వరలో అమలు చేయనున్నట్లు ఖార్ టూరిజమ్ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్కీమ్ అమల్లోకి వస్తే అన్ని దేశాలకు చెందిన ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణీకులు ఎలాంటి రుసుమూ లేకుండా ట్రాన్సిట్ వీసా పొందే అవకాశం ఉంటుంది. దోహా ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు ఖతార్ ఎయిర్వేస్ ద్వారా టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని క్యుటిఎ వర్గాలు వెల్లడించాయి. 38 దేశాలకు చెందదినవారు వీసా ఆన్ అరైవల్కి అర్హులు. 100 ఖతారీ రియాల్స్ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చెల్లించి, దాన్ని పొందవచ్చు. అండోరా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, బెలారస్, బెల్జియమ్, బ్రూనై, కెనడా, సిప్రస్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హాంగ్కాంగ్, హంగేరీ, ఐస్లాండ్, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, స్వీడన్, స్పెయిన్, సౌత్ కొరియా, సింగపూర్, తదితర దేశాలు ఇందులో ఉన్నాయి. క్రూయిజ్ ప్యాసింజర్ల కోసం కూడా క్యుటిఎ అనేక కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అక్టోబర్ 31న లజ్మారా అనే కొత్త క్రూయిజ్ షిప్ని రంగంలోకి దించుతున్నారు. అక్టోబర్ 25న దుబాయ్ నుంచి ప్రారంభమైంది ఈ క్రూయిజ్.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







