ఆఫ్ఘనిస్థాన్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు
- October 26, 2016
: ఆఫ్ఘనిస్థాన్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సెంట్రల్ అఫ్గాన్ ప్రావిన్స్ గోహోర్లో ఉగ్రవాదులు సుమారు 30 మంది పౌరులను అపహరించి అనంతరం వారిని హత్య చేశారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రావిన్షియల్ క్యాపిటల్ ఫిరోజ్ కోహ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిన్న స్థానిక ఐఎస్ కమాండర్ను హతమార్చినందుకు ఐఎస్ ప్రతీకారంగా పౌరులను చంపేసిందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
నిన్న భద్రతా సిబ్బంది స్థానికుల సహాయంతో స్థానిక ఐఎస్ కమాండర్నుహతమార్చారు. దీంతో వెంటనే నిన్న రాత్రే ఐఎస్ ఉగ్రవాదులు 30 మంది గ్రామస్థులను అపహరించారు.
వారిలో ఎక్కువ మంది గొర్రెల కాపరులు. వారి మృతదేహాలను స్థానికులు ఈరోజు ఉదయం గుర్తించారు. అయితే వీరి హత్యలకు ఐఎస్ అధికారికంగా బాధ్యత వహించలేదు. ఆఫ్ఘనిస్థాన్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణంగా అరాచకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం కాబూల్లో ఉగ్రవాదులు దాడి చేయడంతో సుమారు 80 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







