ఆంధ్ర,తెలంగాణా ముఖ్యమంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు
- August 23, 2015
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులకు ఆధునాతన బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉపయోగించనున్నారు. తొలుత కెసిఆర్ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ బస్సు కొన్నది. ఆ తర్వాత రెండు రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు కోసం రూ.5 కోట్ల విలువైన బుల్లెట్ ప్రూఫ్ బస్సు వచ్చింది. దీనిని చంద్రబాబు జిల్లాల పర్యటనలకు ఉపయోగించనున్నారు. కెసిఆర్, చంద్రబాబుల బుల్లెట్ ప్రూఫ్ బస్సుల పైన విమర్శలు కూడా వచ్చాయి. నిధులు లేవంటూ బస్సుల కోసం ఇంత ఖర్చు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కోసం అన్నిహంగులతో కూడిన అత్యధునాతన బస్సు గత జూలై మొదటి వారంలో హైదరాబాదుకు చేరుకుంది. దానికి పూజలు కూడా జరిగాయి. చండీగఢ్లో రూపొందించిన ఈ బస్సు పూజలు జరిగిన తర్వాత రంగారెడ్డి జిల్లా చిలుకూరుకు చేరుకుంది. అక్కడ పూజలు చేశారు. అత్యధునాతన హంగులతో చంద్రబాబు కోసం కూడా చండీగఢ్లో బస్సు తయారయి, ఇటీవలే విజయవాడకు వచ్చింది. రాష్ట్రంలోని జిల్లాల పర్యటనకు, అతిథిగృహంతో సంబంధం లేకుండా వాహనంలోనే బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను బస్సులో చేశారు. భద్రతకు పూర్తి గ్యారంటీ ఉండే విధంగా అద్దాలతో సహా అంతా బుల్లెట్ల నుంచి రక్షణ కల్పించే విధంగా దాన్ని రూపొందించారు. టైర్లను తూటాలతో పేల్చినా కూడా 30 - 50 కిలోమీటర్ల వరకు బస్సు సాఫీగా ప్రయాణిస్తుంది. జెసిబీఎల్ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్తో కలిసి ఈ బస్సును తయారు చేసింది. ఈ బస్సులో కార్యాలయం ఏర్పాటు కూడా ఉంటుంది. ఆరుగురు ఏడుగురు కూర్చునే విధంగా సీటింగ్ ఆరేంజ్మెంట్ ఉంటుంది. దాని వెనక సిఎం కోసం ప్రత్యేక గది ఉంటుంది. 15, 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకునేందుకు రివాల్వింగ్ చైర్, రాత్రి వేళ నిద్రపోవడానికి పరువు ఉంటాయి. బస్సు వెనక భాగంలో స్నానాల గది ఉంటుంది. టీవీ, ఫ్యాక్స్, ఇంటర్నెట్, వైఫై, ప్రింటర్ సదుపాయాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతన బస్సు వచ్చింది. రూ.5 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో తయారైన బస్సును సిఎం చంద్రబాబు శుక్రవారం నాడు పరిశీలించారు. దీనిని జిల్లా పర్యటనల్లో ఉపయోగిస్తారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









