డ్రగ్స్ దందా గుట్టు రట్టు

- October 28, 2016 , by Maagulf
డ్రగ్స్ దందా గుట్టు రట్టు

సికింద్రాబాద్‌ సైనిక్‌పురిలో డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేశారు ఏసీబీ అధికారులు. సైంటిస్ట్ రాజశేఖర్ సైనిక్‌పురిలో ఎవరికీ అనుమానం రాకుండా ఓ ఇంట్లో మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు నార్కోటిక్‌ కంట్రోల్ బోర్డు అధికారులకు సమాచారం అందింది. దీంతో రాజశేఖర్‌ ఇంటిపై దాడి చేసిన అధికారులు 230 కిలోల యాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్‌ తయారు చేసి విదేశాలకు సరఫరా చేస్తున్నాట్లు గుర్తించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com