ఎమిరేట్ ఏంజిల్, పిల్లల రాణి ఈ పాప’ అంటున్న రషీద్
- October 29, 2016
నిండా పదేళ్లు కూడా లేని పాప.. ఏకంగా దుబాయ్ రాజు, యూఏఈ ప్రధానమంత్రి అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టోమ్ను ఇమిటేట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ సభలో రాజు చేసిన ప్రసంగాన్ని అనుకరించి మాట్లాడిన పాప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో కాస్తా రాజు దగ్గరకు చేరడం, పాప ముద్దు ముద్దు మాటలకు ఆయన కూడా మురిసిపోయి.. పాపను కలవాలనుకోవడం వెంటవెంటనే జరిగాయి. ‘ఈ పాపను కలవాలనుకుంటున్నాను. ఈమె వివరాలు తెలిసిన వాళ్లు చెప్పండి’ అని స్వయంగా ట్విటర్ వేదికగా రషీద్ అడిగిన వెంటనే.. వేల కొలది రిప్లైలు ట్విటర్లో వచ్చాయి. ఆమె పేరు ముహ్రా అల్ షేహీ అనీ, షార్జాహ్కు చెందిన పాప అని తెలిపారు. దీంతో షార్జాహ్లోని రాజు ఇంటికి పాప కుటుంబాన్ని అధికారులు తీసుకువచ్చారు. వారితో సరదాగా గడిపారు. పాప చదువు వివరాలు తెలుసుకున్నారు. పాపతో అక్కడ కూడా వీడియోలో ఇమిటేట్ చేసిన విధంగా మాట్లాడించుకున్నారు. సరదాగా రాజు ఇల్లంతా ఆ పాప తిరిగింది. గెంతులు వేస్తూ ఇల్లంతా సందడి చేసింది. ఒడిలో కూర్చోబెట్టుకుని పాపతో సరదాగా సంభాషించారు. షార్జాహ్ మోడల్ స్కూల్లో గ్రేడ్ వన్ చదువుతున్నట్లు షేహీ తండ్రి తెలిపారు. ఆ పాపకు తమ్ముడు అబ్దుల్లా (5), చెల్లి ఆస్మా(3) ఉన్నారు. ‘ నా కూతురు ముహ్రా అల్ షేహీతో ఓ రోజు గడిపాను. చాలా ఆనందంగా ఉంది. ఎమిరేట్ ఏంజిల్, పిల్లల రాణి ఈ పాప’ అంటూ రషీద్ ట్విట్ చేశారు. పాపతో సరదాగా గడిపిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.. ఆ పాప మాట్లాడిన వీడియోను మీరూ చూడండి...
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







