నేడు భారత దేశ రాజధానిలో వంద అగ్ని ప్రమాదాలు
- October 30, 2016
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కాల్చే బాణసంచా కారణంగా దేశ రాజధాని దిల్లీ వ్యాప్తంగా దాదాపు వంద చిన్న చిన్న అగ్నిప్రమాదాలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని వివరించారు. దీపావళి పండుగ సెలవు తీసుకోకుండా దిల్లీ అగ్నిమాపక దళాలు పనిచేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు. దీనిపై అగ్నిమాపక ముఖ్య అధికారి జీసీ మిశ్రా మాట్లాడుతూ 1500 ఫైర్ ఫైటర్స్ను వివిధ ప్రాంతాల్లో సేవలందించేందుకు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. మొత్తం 59 అగ్నిమాపక కేంద్రాలున్నాయని, అదనంగా 22కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గతేడాది లెక్కల ప్రకారం 290 కేసులు నమోదయ్యాయని, ఈ సారి ఎలాంటి నష్టం జరగకుండానే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని అన్నారు.
అటు సర్దార్జంగ్ ఆస్పత్రి, రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద బాధితుల కోసం అదనపు వార్డులు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









