నేడు భారత దేశ రాజధానిలో వంద అగ్ని ప్రమాదాలు
- October 30, 2016
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కాల్చే బాణసంచా కారణంగా దేశ రాజధాని దిల్లీ వ్యాప్తంగా దాదాపు వంద చిన్న చిన్న అగ్నిప్రమాదాలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని వివరించారు. దీపావళి పండుగ సెలవు తీసుకోకుండా దిల్లీ అగ్నిమాపక దళాలు పనిచేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు. దీనిపై అగ్నిమాపక ముఖ్య అధికారి జీసీ మిశ్రా మాట్లాడుతూ 1500 ఫైర్ ఫైటర్స్ను వివిధ ప్రాంతాల్లో సేవలందించేందుకు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. మొత్తం 59 అగ్నిమాపక కేంద్రాలున్నాయని, అదనంగా 22కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గతేడాది లెక్కల ప్రకారం 290 కేసులు నమోదయ్యాయని, ఈ సారి ఎలాంటి నష్టం జరగకుండానే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని అన్నారు.
అటు సర్దార్జంగ్ ఆస్పత్రి, రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద బాధితుల కోసం అదనపు వార్డులు ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







