మెయింటెనెన్స్ నిమిత్తం ముంబై ఎయిర్ పోర్టు మూసివేత...
- October 30, 2016
దేశ వాణిజ్య రాజధానిలోని విమానాశ్రయం నుంచి టికెట్ నుంచి బుక్ చేసుకున్నారా, ఈ రోజు ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారా.. అయితే మీ ప్రయాణం ఆలస్యం కావొచ్చు. ఎందుకంటే సోమవారం మధ్యాహ్నం నుంచి 5 గంటల పాటు విమానాశ్రయం మూసివేయనున్నారు. రన్ వే మెయింటెనెన్స్ పనుల నిమిత్తం ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఎయిర్ పోర్టును మూసివేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని విమానయాన సంస్థలు, పైలట్లకు ముందుగానే తెలిపారు. ఈ షెడ్యూల్ కు అనుగుణంగా విమాన సర్వీసులు నడపాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కోరారు.
మూసివేత ప్రభావం సాయంత్రం విమాన రాకపోకలపై పడనుంది. ముంబై విమానాశ్రయం నుంచి 1600పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
ఇందులో ఎక్కువ దేశీయ సర్వీసులు. అయితే అక్టోబర్ 18న మొదలైన నిర్వహణ పనులు నవంబర్ చివరి వారంలో ముగుస్తాయని ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. ఈరోజు రన్ వే మూసివేస్తున్నందున విమాన రాకపోకలకు అంతరాయం కలగనుందని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







