నల్గురు ప్రవాసీయులకు 10 ఏళ్ళ జైలుశిక్ష,దేశ బహిష్కరణ
- October 31, 2016
దోపిడీకి పాల్పడిన నల్గురు ప్రవాసీయులకు పదేళ్ల జైలుశిక్ష ఆ తర్వాత దేశ బహిష్కరణను విధిస్తూ,దోహా నేర న్యాయస్థానం ఆదేశించింది. ఈ సమాచారంను ఆదివారం కోర్టు అధికార వర్గాలు నివేదించారు.ఒక స్థానిక నగదు మార్పిడి కంపెనీ ఉద్యోగి వాహనం నుండి1.5 మిలియన్ క్యూ ఆర్ లను ఈ నలుగురు ముద్దాయిలు దొంగిలించినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.ఛార్జ్ షీట్ లోని వివరాల ప్రకారం, దోషులు ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో బాధితుడు ప్రయాణిస్తున్న వాహనంకు ఎదురుగా వచ్చి వారి వాహనంతో " ఢీ " కొట్టించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఆ సమయంలో ఆ నల్గురు నిందితులు ఉద్యోగి వద్ద నుంచి డబ్బుతో నిండుగా ఉన్ననగదుసంచిని పట్టుకుని పారిపోయారు.పోలీసులు జరిపిన పరిశోధనలో ఈ నల్గురు ముద్దాయిలు దొంగిలించిన ఒక నంబర్ ప్లేట్ కారుని ఈ దోపిడీకి వినియోగించినట్లు వెల్లడించారు. దోపిడీ అనంతరం వారు ఉపయోగించిన కారుని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు. చోరీ చేసిన డబ్బుతో ఒకొక్కరు అనుమానం రాకుండా దేశం విడిచి పారిపోయేందుకు ఆ నల్గురు పధక రచన చేశారు. విషయం సద్దుమణిగి పోయిందనుకొని కొన్ని రోజుల తర్వాత విమానాశ్రయం నుంచి పారిపోయే మొదటి వ్యక్తి రాక కోసం ఎదురుచూస్తున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన ముగ్గురు సహచరుల ఆచూకీ గురించి పోలీసులకు వివరించి సహకరించిన మొదటి వ్యక్తి తాము చేసిన దోపిడీని అంగీకరించాడు. వారు చివరికి వారి నేరాన్ని అంగీకరించాడు,వారు దొంగిలించిన డబ్బులో వారు కొంత ఖర్చు చేయగా మిగిలిన నగదుని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







