ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై టెర్రర్‌ కుట్ర భగ్నం

- October 31, 2016 , by Maagulf
ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై టెర్రర్‌ కుట్ర భగ్నం

మనామా: జెడ్డాలోని రెడ్‌ సీలోగల జవహారా స్టేడియంలో ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ క్వాలిఫైర్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో విధ్వంసం సృష్టించడానికి పన్నిన టెర్రర్‌ కుట్రని సౌదీ సెక్యూరిటీ ఏజెన్సీ ముందే పసిగట్టి, ఆ కుట్రను ఛేదించింది. కొద్ది రోజుల ముందే టెర్రర్‌ కుట్రపై సమాచారం సేకరించిన భద్రతాదళాలు, సెక్యూరిటీ ఏజెన్సీ వ్యూహాత్మకంగా స్పందించాయి. టెర్రిస్టులు స్టేడియం పార్కింగ్‌ లాట్‌లోని ఓ కారులో పేలుడు పదార్థాల్ని ఉంచాలనుకున్నారు. అయితే భద్రతాదళాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతో టెర్రరిస్టుల పాచిక పారలేదు. ఈ కుట్రకు సూత్రధారులుగా ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులు, అలాగే ఒకరు సిరియన్‌, మరొకరు సుడానీస్‌ ఉన్నట్లు తేలింది. తీవ్రవాదులు టార్గెట్‌ చేసిన మ్యాచ్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగ్గా, ఈ మ్యాచ్‌లో సౌదీ అరేబియా 3-0 తేడాతో విజయం సాధించింది. ఇంకో కేసులో భద్రతాదళాలపై దాడులకు యత్నించిన నలుగురు తీవ్రవాదుల గ్రూప్‌ని నిర్వీర్యం చేశారు. దయీష్‌ టెర్ర్‌ గ్రూప్‌కి చెందిన లీడర్‌తో ఈ నలుగురికీ సంబంధాలున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com