బ్యాంకులకు సీవీసీ స్పష్టీకరణ
- October 31, 2016
విజయ్ మాల్యా తరహాలో భారీ రుణ ఎగవేత ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కొన్ని చర్యలు చేపట్టింది. రూ.కోటికి మించిన ఎగవేత అంశాలను తప్పనిసరిగా తన దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్పష్టంచేసింది. వీటిని పరిశీలించి.. సీబీఐ విచారణకు ఆదేశించాలా వద్దా అన్నదానిపై సిఫార్సులు చేస్తుంది. ఈ అంశంలో సహకరించడానికి సీవీసీ ఇప్పటికే నలుగురు జనరల్ మేనేజర్ స్థాయి బ్యాంకు అధికారులను సలహాదారులుగా నియమించుకుంది. 2015లో బ్యాంకు మోసాలకు సంబంధించి రూ.20,646 కోట్లతో ముడిపడిన 171 కేసులను సీబీఐ దర్యాప్తు చేసింది.రూ.50 కోట్ల కన్నా ఎక్కువ మొత్తాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించడానికి నెలనెలా రిజర్వు బ్యాంకు, సీబీఐ, బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించాలని కూడా సీవీసీ నిర్ణయించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







