దివాళీ క్రాకర్ తెచ్చిన చేటు
- November 01, 2016
దుబాయ్: దీపావళి సందర్భంగా దుబాయ్లో కొందరు ఇండియన్స్ సెలబ్రేషన్స్లో మునిగి తేలుతున్న సమయంలో, 10వ తరగతి స్టూడెంట్ మొహమ్మద్ రిజ్వాన్, ఆ మార్గంలో వెళుతూ, పేలుతున్న క్రాకర్స్ని దగ్గరనుంచి చూసే ప్రయత్నం చేశాడు. అయితే అనుకోకుండా ఓ క్రాకర్ పేలి, రిజ్వాన్ కంటికి తీవ్ర గాయమైంది. వెంటనే, అతని సహచరులు గాయపడ్డ రిజ్వాన్ని ఆసుపత్రికి తరలించారు. సినిమాకి వెళ్ళి తిరిగొస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం రిజ్వాన్ని, దుబాయ్ హాస్పిటల్కి తరలించారు. ఎక్స్రే మరియు స్కాన్ నిర్వహఙంచిన తర్వాత, రెటీనా కార్నర్లో గాయమైందనీ, మూడు రోజులు కంటికి పూర్తి రెస్ట్ అవసమని వైద్యులు వెల్లడించారు. నెల రోజులపాటు కంట్లో ఎరుపుదనం ఉంటుందని, ఆ తర్వాత గాయం మానుతుందని వైద్యులు వివరించారు. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన రిజ్వాన్ తల్లి సోఫియా బేగమ్, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రిజ్వాన్ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఇండియాలో ఉంటారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







