మనామాలో భారతీయుడు మృతి
- November 01, 2016
మనామా: తన గదిలో మృతి చెందిన ఒక ప్రవాస భారతీయుని మృతదేహంను ఈ ఉదయం కనుగొన్నారు. 53 ఏళ్ళ వయస్సు గల మమ్మద్ కుంజు మనామా లోని సామాజిక బీమా జనరల్ సంస్థ కార్యాలయంలో (GOSI)లో విధులు నిర్వహిస్తున్నాడు. భారతదేశంలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం గత నెలలో బహెరేన్ తిరిగి వచ్చాడు. మమ్మద్ కుంజు తన వసతి వద్ద స్నేహితులతో కల్సి విందు భోజనం చేసిన తరువాత నిద్ర పోవడానికి మంచానికి వెళ్ళినట్లు ఆయన స్నేహితులు పేర్కొంటున్నారు. దక్షిణ భారతదేశం లోని కేరళ రాష్ట్రం నుండి వచ్చిన మమ్మద్ కుంజు ఆకస్మికంగా చనిపోవడంతో అతని స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంను సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీకి తరలించారు కుంజుకి చెందిన పాస్ పోర్ట్ మరియు ఇతర పత్రాలు బాబ్ అల్ బహరేన్ పోలీసు స్టేషన్ వద్ద ఉన్నాయి. కుంజు గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రవాసులు జీవితం గడుపుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







