దుబాయ్లో 45 శాతం షవరమా స్టాండ్స్ మూసివేత
- November 01, 2016
దుబాయ్: దుబాయ్లో 45 శాతం షవరామా స్టాండ్స్ మూసివేయబడనున్నాయి. షవరామా స్టాండ్స్ విషయంలో మునిసిపాలిటీ ఖచ్చితమైన గైడ్లైన్స్ రూపొందించి, వాటిని పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో కొన్ని స్టాండ్స్, మునిసిపాలిటీ గైడ్ లైన్స్ మేరకు మార్పులు చేర్పులు చేస్తుండగా, మరికొన్ని మూసివేతకు నిర్ణయం తీసుకున్నాయి. మొత్తం 572 మీడియా ఫుడ్ ఔట్లెట్స్కి షవరామా స్టాండ్స్ విషయమై ఆరు నెలల డెడ్లైన్ని విధించారు. వినియోగదారుల ఆరోగ్యమే ముఖ్యమన్న కోణంలో కొత్త విధి విధానాల్ని మునిసిపాలిటీ జారీ చేసింది. అక్టోబర్ 31తో ఈ డెడ్లైన్ ముగిసింది. ఇప్పటివరకు కేవలం 318 స్టాండ్స్ మాత్రమే మార్పులు చేర్పులు చేసుకున్నాయి విధి విధానలకు అనుగుణంగా.113 స్టాండ్స్ పూర్తిగా ఆపివేయబడ్డాయని, 141 స్టాండ్స్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఏ స్టాండ్ ఉన్నా మూసివేయిస్తామని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ - ఫుడ్ ఇన్స్పెక్షన్ సెక్షన్ హెడ్ సుల్తాన్ అలి అల్ తాహెర్ చెప్పారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







