ద్రోన్లతో నష్టంపై ఎమిరేట్స్ ఆవేదన
- November 01, 2016
ఫ్లైట్ డైవర్షన్స్, నెట్వర్క్ సమస్యలు ఇవన్నీ డ్రోన్ల కారణంగా ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులుగా గుర్తించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (డిఎక్స్బి) పరిసరాల్లో ద్రోన్లు సృష్టిస్తున్న నష్టం చాలా ఎక్కువేనని ఎమిరేట్స్ ఎయిర్లైన్ తేల్చింది. మిలియన్స్ ఆఫ్ దిర్హామ్స్ ప్రతిసారీ నష్టపోవాల్సి వస్తోందని ఆ సంస్థ విశ్లేషించింది. వేలాదిమంది ప్రయాణీకులు వీటితో ఇబ్బంది పడుతున్నారని ఎమిరేట్స్ వర్గాలు వెల్లడించాయి. ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అదెల్ అల్ రెధా మాట్లాడుతూ, ఫ్లైట్ డైవర్షన్లు, ఎక్స్టెన్సివ్ హోల్డింగ్ అనేవి చాలా ఖరీదైన సమస్యలుగా మారుతున్నాయని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటిదాకా మూడు ఇన్సిడెంట్స్ చాలా ఇబ్బందికరంగా మారాయి. అక్టోబర్ 29న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 80 నిమిషాలపాటు మూసివేయబడింది. 22 విమానాల్ని మళ్ళించాల్సి వచ్చింది. వీటిల్లో 11 ఎమిరేట్స్ ఎయిర్లైన్స్కి చెందినవే. సెప్టెంబర్లో 30 నిమిషాలపాటు సమస్య తలెత్తింది. ఎమిరేట్స్కి చెందిన 85 విమానాల షెడ్యూల్ డిలే అయ్యింది. జూన్లో కూడా ఇలాంటి సమస్య తలెత్తింది. భద్రత అతి ముఖ్యమైన అంశమనీ, అలాగే ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడం, సమయపాలన కూడా ముఖ్యమని చెబుతూ ద్రోన్ల విషయంలో ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అల్ రెధా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







