పేలుడు కేసులో నిందితుల విచారణ

- November 02, 2016 , by Maagulf
పేలుడు కేసులో నిందితుల విచారణ



మనామా: పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ 11 మంది నిందితుల్ని హై క్రిమినల్‌ కోర్ట్‌కి రిఫర్‌ చేసింది. డిసెంబర్‌ 7న ఈ కేసు విచారణకు రానుంది. షేక్‌ జబెర్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా వెన్యూలో అల్‌ నువైదెరాత్‌ రౌండెబౌట్‌ ప్రాంతంలో జూన్‌ 30న జరిగిన పేలుడు ఘటనలో ఈ 11 మంది నిందితులు. బహ్రెయిన్‌కి చెందిన ఓ మహిళ ఈ పేలుడులో మృతి చెందింది. నిందితులో 9 మంది పోలీసు కస్టడీలో ఉన్నారు. పరాయి దేశంతో కలిసి స్వదేశానికి చెందిన రహస్య సమాచారాన్ని తస్కరించడం, పేలుళ్ళకు పాల్పడటం, వెపన్స్‌ని సమీకరించడం, వెపన్స్‌ మరియు బాంబుల్ని పేల్చడంలో శిక్షణ పొందడం వంటి నేరాలు వీరిపై మోపబడ్డాయి. ఇరానియన్‌ రివల్యూషన్‌ గార్డ్‌ తరఫున ఇరాన్‌లో శిక్షణ పొందిన వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు బాంబుని తయారు చేయగా, మరికొంతమంది బాంబుని పేల్చారు. పేలుడులో ఓ మహిళ మృతి చెందగా, ఆమె పిల్లలకు గాయాలయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com