'చిలకమర్తి'కి అరుదైన పురస్కారం
- November 02, 2016
మందపల్లి మందేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన పంచాంగకర్త, తొలి ఆంగ్లపంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర శర్మ జ్యోతిష రంగానికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా 'జ్యోతిష ప్రపూర్ణ' బిరుదును అందుకున్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన సమావేశంలో మందేశ్వరదేవస్థానం చైర్మన్ బండారు సూర్యనారాయణమూర్తి, ఈఓ వెచ్చా దేవు ళ్లు, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి, ఇతర అతిథుల చేతులమీదుగా చిలకమర్తి ప్రభాకర శర్మ ఈ బిరుదాన్ని అందుకున్నారు.ఎం.టెక్, ఎంబీయే చదివిన చిలకమర్తి భద్రాచలం దేవస్థానంలో జ్యోతిష విద్యను నేర్చుకుని తెలుగు, ఆంగ్ల భాషలలో ఏటా పంచాంగాలు వెలువరిస్తున్నారు.
శ్రీ మందేశ్వరస్వామి మహాత్మ్యం పుస్తకావిష్కరణ
'శనిదేవుని గురించి ప్రజలలో ఉన్న అపోహలు దూరం చేయడానికి ఈ పుస్తకం రచించాను అని గ్రంథకర్త చిలకమర్తి తెలిపారు. ఆయన తెలుగు, ఆంగ్ల భాషలలో రచించిన 'శ్రీమందేశ్వరస్వామి మహాత్మ్యం' పుస్తకాన్ని సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి బుధవారం ప్రెస్క్లబ్లో ఆవిష్కరించారు. శనిగ్రహ పీడితులు ఉపశమనం పొందడానికి స్థలపురాణంతో పాటు శని స్తోత్రాలను పుస్తకంలో పొందుపరిచామన్నారు. గ్రంథ సమీక్ష చేసిన కవి, గాయకుడు ఎర్రా ప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ శనిదశలో ఉన్నవారి భయాందోళనలను ఈ పుస్తకం దూరం చేస్తుందని తెలిపారు. మందపల్లి దేవస్థానం ఛైర్మన్ బండారు సూర్యనారాయణమూర్తి, కార్యనిర్వహణాధికారి వెచ్చా దేవుళ్లు, ఇతర ప్రముఖులు గ్రంథకర్తను సత్కరించారు. కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి, బీజేపి నాయకులు వీరన్నచౌదరి తదితరులు పాల్గొన్నారు.




తాజా వార్తలు
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!









