అమ్నెస్టీ తర్వాత కఠిన చర్యలు తప్పవు
- November 03, 2016
మూడు నెలల అమ్నెస్టీ ముగిసిన తర్వాత అక్రమంగా నివసిస్తున్నవారిపై సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కఠిన చర్యలు తీసుకోనుంది. సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా జబెర్ లెబ్దా మాట్లాడుతూ, అమ్నెస్టీని చాలామంది ఆశ్రయించారనీ, గ్రేస్ పీరియడ్లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోనివారిపై కఠినచర్యలు ఉంటాయని అన్నారు. అమ్నెస్టీ ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో ఇన్స్పెక్షన్ కార్యక్రమం ఉంటుందని తెలిపారాయన. డిసెంబర్ 1తో అమ్నెస్టీ పీరియడ్ ముగియనుంది. అమ్నెస్టీని పొడిగించే అవకాశం ప్రస్తుతానికి అయితే లేదనీ, ప్రస్తుతం కేటాయించిన సమయం సరిపోతుందని బ్రిగేడియర్ లెబ్దా అభిప్రాయపడ్డారు. ఎయిర్ టికెట్ విషయంలో ఇబ్బందులేమైనా తలెత్తితే, అలాంటివారిని మానవీయ కోణంలో ఆదుకునేందుకు డిపార్ట్మెంట్ ముందుకు వస్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







