ప్రమాదంలో యమునా ఎక్స్ప్రెస్..
- November 03, 2016
దట్టమైన పొగమంచు కారణంగా రాజధాని దిల్లీ సమీపంలో గురువారం ఉదయం యమునా ఎక్స్ప్రెస్ హైవేపై వరుసగా 20 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దిల్లీలో గత కొద్ది రోజులుగా కాలుష్యం స్థాయులు విపరీతంగా పెరగడంతో అది దట్టమైన పొగమంచుతో కలిసి వాతావరణంలో వ్యాపిస్తోంది. పొగమంచు వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. దీపావళి పండగ రోజు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో వాటి పొగ కారణంగా కాలుష్యం స్థాయి మరింత పెరిగింది. దిల్లీ, నోయిడా, ఆగ్రాలను కలిపే ఈ ఎక్స్ప్రెస్ హైవేపై గతంలో కూడా పలుమార్లు పొగమంచు కారణంగా ఈ తరహా ప్రమాదాలు జరిగాయి.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







