కార్మిక సంస్కరణలు 100 శాతం అమలు

- November 03, 2016 , by Maagulf
కార్మిక సంస్కరణలు 100 శాతం అమలు

ఖతార్‌లో 100 శాతం కార్మిక సంస్కరణలు అమలవుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. 2016 డిసెంబర్‌ నాటికి ఈ ఘనతను సాధిస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్కరణలు ప్రారంభించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా దోహాలో విడుదలైన గణాంకాల్ని బట్టి చూస్తే 2.1 మిలియన్‌ వర్క్‌ ఫోర్స్‌లో 1.8 మిలియన్‌ కార్మికులకు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో వేతనాల చెల్లింపు జరుగుతోంది. వేజ్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ ఫలితమే ఇది. సుమారుగా 37,000 కంపెనీలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. బ్లూ కాలర్‌ వర్కర్స్‌కి జీతాల చెల్లింపులో సమస్యలపై హక్కుల సంస్థలు పోరాటం చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గడచిన ఏడాది కాలంలో కార్మిక శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 385 ఉల్లంఘనలు నమోదయ్యాయి. అయితే ఈ ఉల్లంఘనలకు సంబంధించి యజమానులు ఎవరైనా శిక్షింపబడ్డారా? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. సెప్టెంబర్‌లో 400 మంది మైగ్రెంట్‌ స్టాఫ్‌, నాలుగు నెలలపాటు జీతాలు లేక ఇబ్బందులు పడిన విషయం వెలుగు చూసింది. చిన్న చిన్న సమస్యలు, సవాళ్ళు ఉన్నప్పటికీ వేజ్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ని సమర్థవంతంగా, సంపూర్ణగా అమలు చేస్తున్నట్లు లేబర్‌ మినిస్టర్‌ ఇస్సా బిన్‌ సాద్‌ అల్‌ జఫాలి అల్‌ నౌమి చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com