రాజధానిలో స్కూళ్లకు సెలవు

- November 04, 2016 , by Maagulf
రాజధానిలో స్కూళ్లకు సెలవు

దేశ రాజధానిలో సుమారు 1800 ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ళు మూతబడనున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. దీపావళీ తర్వాత పొగ మంచు తీవ్రత మరింత పెరిగింది. దీంతో దేశ రాజధాని వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత రెండు రోజులుగా పలు ప్రైవేట్ స్కూళ్ళను మూసివేశారు. అయితే వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రభుత్వం సుమారు 1800 మున్సిపల్ ప్రాథమిక స్కూళ్ళకు శనివారం అధికారికంగా సెలవు ప్రకటించింది. సోమవారం నుంచి స్కూళ్లు యథావిధిగా పని చేస్తాయని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com