రాజధానిలో స్కూళ్లకు సెలవు
- November 04, 2016
దేశ రాజధానిలో సుమారు 1800 ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ళు మూతబడనున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. దీపావళీ తర్వాత పొగ మంచు తీవ్రత మరింత పెరిగింది. దీంతో దేశ రాజధాని వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత రెండు రోజులుగా పలు ప్రైవేట్ స్కూళ్ళను మూసివేశారు. అయితే వాతావరణ కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రభుత్వం సుమారు 1800 మున్సిపల్ ప్రాథమిక స్కూళ్ళకు శనివారం అధికారికంగా సెలవు ప్రకటించింది. సోమవారం నుంచి స్కూళ్లు యథావిధిగా పని చేస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







