టర్కీలో భారీ కారు బాంబు పేలుడు:ఒకరి మృతి, 30 మందికి గాయాలు

- November 04, 2016 , by Maagulf
టర్కీలో భారీ  కారు బాంబు పేలుడు:ఒకరి మృతి, 30 మందికి గాయాలు

- ఒకరి మృతి, 30 మందికి గాయాలు 
- కుర్దు తిరుగుబాటుదారులపైనే అనుమానాలు 
అంకారా : టర్కీలోని దియార్‌బాకిర్‌ నగరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి సమీపంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు తాకిడితో పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలో ఉన్న నాలుగు భవనాలు భారీగా ధ్వంసమయ్యాయి. టర్కీ సైన్యం, ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.ఇదిలా ఉండగా, కుర్దిస్తాన్‌ వర్కర్స్‌ పార్టీకి ( పీకేకే ) చెందిన తిరుగుబాటుదారుల ఏరివేత కోసం టర్కీ ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌ను పీపుల్స్‌ డెమోక్రసీ పార్టీ (హెచ్‌డీపీ ) వ్యతిరేకిస్తున్నది. గురువారం అర్థరాత్రి 11మంది ఎంపీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో, దియార్‌ బాకిల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎంపీలు అరెస్టయిన కొద్దిగంటల్లోనే ఈ పేలుడు సంభవించింది. దీంతో, కుర్దు తిరుగుబాటుదారులే ఈ పేలుడుకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com