టర్కీలో భారీ కారు బాంబు పేలుడు:ఒకరి మృతి, 30 మందికి గాయాలు
- November 04, 2016
- ఒకరి మృతి, 30 మందికి గాయాలు
- కుర్దు తిరుగుబాటుదారులపైనే అనుమానాలు
అంకారా : టర్కీలోని దియార్బాకిర్ నగరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పోలీస్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, పోలీస్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు తాకిడితో పోలీస్ హెడ్క్వార్టర్స్కు సమీపంలో ఉన్న నాలుగు భవనాలు భారీగా ధ్వంసమయ్యాయి. టర్కీ సైన్యం, ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.ఇదిలా ఉండగా, కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి ( పీకేకే ) చెందిన తిరుగుబాటుదారుల ఏరివేత కోసం టర్కీ ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ను పీపుల్స్ డెమోక్రసీ పార్టీ (హెచ్డీపీ ) వ్యతిరేకిస్తున్నది. గురువారం అర్థరాత్రి 11మంది ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, దియార్ బాకిల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎంపీలు అరెస్టయిన కొద్దిగంటల్లోనే ఈ పేలుడు సంభవించింది. దీంతో, కుర్దు తిరుగుబాటుదారులే ఈ పేలుడుకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









