టర్కీలో భారీ కారు బాంబు పేలుడు:ఒకరి మృతి, 30 మందికి గాయాలు
- November 04, 2016
- ఒకరి మృతి, 30 మందికి గాయాలు
- కుర్దు తిరుగుబాటుదారులపైనే అనుమానాలు
అంకారా : టర్కీలోని దియార్బాకిర్ నగరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పోలీస్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, పోలీస్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు తాకిడితో పోలీస్ హెడ్క్వార్టర్స్కు సమీపంలో ఉన్న నాలుగు భవనాలు భారీగా ధ్వంసమయ్యాయి. టర్కీ సైన్యం, ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.ఇదిలా ఉండగా, కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి ( పీకేకే ) చెందిన తిరుగుబాటుదారుల ఏరివేత కోసం టర్కీ ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ను పీపుల్స్ డెమోక్రసీ పార్టీ (హెచ్డీపీ ) వ్యతిరేకిస్తున్నది. గురువారం అర్థరాత్రి 11మంది ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, దియార్ బాకిల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎంపీలు అరెస్టయిన కొద్దిగంటల్లోనే ఈ పేలుడు సంభవించింది. దీంతో, కుర్దు తిరుగుబాటుదారులే ఈ పేలుడుకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







