టర్కీలో భారీ కారు బాంబు పేలుడు:ఒకరి మృతి, 30 మందికి గాయాలు
- November 04, 2016
- ఒకరి మృతి, 30 మందికి గాయాలు
- కుర్దు తిరుగుబాటుదారులపైనే అనుమానాలు
అంకారా : టర్కీలోని దియార్బాకిర్ నగరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పోలీస్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, పోలీస్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు తాకిడితో పోలీస్ హెడ్క్వార్టర్స్కు సమీపంలో ఉన్న నాలుగు భవనాలు భారీగా ధ్వంసమయ్యాయి. టర్కీ సైన్యం, ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.ఇదిలా ఉండగా, కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి ( పీకేకే ) చెందిన తిరుగుబాటుదారుల ఏరివేత కోసం టర్కీ ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ను పీపుల్స్ డెమోక్రసీ పార్టీ (హెచ్డీపీ ) వ్యతిరేకిస్తున్నది. గురువారం అర్థరాత్రి 11మంది ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, దియార్ బాకిల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎంపీలు అరెస్టయిన కొద్దిగంటల్లోనే ఈ పేలుడు సంభవించింది. దీంతో, కుర్దు తిరుగుబాటుదారులే ఈ పేలుడుకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









