అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు..

- November 04, 2016 , by Maagulf
అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు..

అర్హులైన ప్రవాస భారతీయుల్లో మరింత మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 1.14 కోట్ల మంది ప్రవాస భారతీయులుండగా కేవలం 16 వేల మంది మాత్రమే విదేశీ భారత ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైన మరింత మందిని ఆకర్షించేందుకు ఈసీ ఆన్‌లైన్‌ సర్వేను ప్రారంభించింది. ఓటింగ్‌ ప్రక్రియ, ఓటరుగా నమోదు తదితర అంశాలపై ప్రవాసీయులను చైతన్య పరిచేలా దీన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన పోటీని కూడా నిర్వహిస్తోంది. రెండు నెలల పాటు (నవంబరు, డిసెంబరు) సర్వే నిర్వహిస్తారు. పోటీని నెలాఖరుకు ముగిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com