నిద్రలేమి వల్ల ప్రమాదాలు
- November 04, 2016
నేడు నిద్రలేమితో బాధపడేవారు నిజానికి లక్షలమంది ఉన్నారు, నిద్రలేమి వంటి నిద్ర రుగ్మత జీవన ప్రమాణాలను నాశనం చేస్తుంది. మీకు కొన్ని రోజులు నిద్ర లేకపోతే ఏమి జరుగుతుంది?
మీరు అలసిపోయినట్లుగా అయి, కోపంతో, రోజంతా నిరుత్సాహంగా ఉంటారు, రాత్రిపూట నిద్ర బాగా పట్టాలని ఆశిస్తూ ఎన్నో రాత్రులు గడుపుతారు.
తక్కువ స్లీప్
చాలామంది నిద్రమాత్రలు వాడడం ప్రారంభిస్తారు. కొంతమంది ఆ మాత్రల మీద ఆధారపడిపోతారు, ఆ మందుల వల్ల ప్రతికూల ప్రభావాలు కలిగినపుడు, మరికొందరు నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు.
అయితే, కొన్ని రోజులు నిద్ర లేకపోతే ఏమి జరుగుతుంది? నిద్రలేమి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ప్రజలు సరిగా నిద్రపోకపోతే ఇళ్ళలో లేదా పనిచేసే ప్రదేశాలలో గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నట్టుగా పరిశోధనలు నిరూపించాయి.
తక్కువ స్లీప్
నిద్రలేమి వల్ల ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. అది మీ ఆలోచనలపై, సమస్యను పరిష్కరించుకునే శక్తిపై, అప్రమత్తత, చురుకుదనం సామర్ధ్యాలపై ప్రభావం చూపిస్తుంది. మీరు తగినంత నిద్ర పోకపోతే, మీ జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. విషయాలను గుర్తు చేసుకోవడం చాలా కష్టమౌతుంది.
తక్కువ స్లీప్
నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, గుండె నొప్పి, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నిద్రలేమి ఫలితంగా గుండేనొప్పి సమస్యతో చాలామంది చనిపోతారు.
నిద్రలేమితో బాధపడేవారు ఎక్కువగా ఆందోళన, వ్యాకులత బారిన పడతారని పరిశోధనలు నిరూపించాయి.
తక్కువ స్లీప్
రోజుకు కనీసం ఏడు గంటలైనా నిద్రపోని వారు త్వరగా వ్రుద్దులవుతారు. వారు బోదకాళ్ళు, నల్ల చారలు, గీతలు, ముడతల బారిన పడతారు.
తక్కువ స్లీప్
కొన్ని రోజులుగా మీకు నిద్ర లేకపోతే, బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. నిద్రలేమి ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. తగినంత నిద్రపోని వారు అవసరమైన దానికంటే ఎక్కువగా తింటారు. ఈ విధానంలో, వారు బరువు పెరుగుతారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







