నిర్మాత కె.కె.రాధామోన్ మూడు చిత్రాలను నిర్మించే ప్లాన్ ...

- November 04, 2016 , by Maagulf
నిర్మాత కె.కె.రాధామోన్  మూడు చిత్రాలను నిర్మించే ప్లాన్ ...

తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త హీరోల సందడి బాగా మొదలైంది. ఇక అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్‌ వంటి సూపర్‌హిట్‌ అందించి ప్రస్తుతం లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెన్సార్‌ పూర్తి చేసుకొని నవంబర్‌లోనే విడుదలకు సిద్ధమైంది. ఇప్పటి వరకు తెలుగులో థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ అంటూ కడుపుబ్బా నవ్వించిన ఫృథ్వి ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు.సెంటిమెంట్, కామెడీ తో కూడిన ఈ చిత్రం మంచి ప్రజాదరణ లభిస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్.తాజాగా ఈ చిత్ర నిర్మాత కె.కె.రాధామోన్ మరో మూడు చిత్రాలను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా జనవరిలో ఓ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఇంకో చిత్రాన్ని నిర్మించనున్నారు.యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా మరో చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాల ప్లానింగ్‌లో, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రం విడుదల సన్నాహాల్లో నిర్మాత కె.కె.రాధామోహన్‌ చాలా బిజీగా వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com