ఇక నుంచి గోడలపై రాతలు రాస్తే కఠిన చర్యలు : కేటీఆర్‌

- November 05, 2016 , by Maagulf
ఇక నుంచి గోడలపై రాతలు రాస్తే కఠిన చర్యలు : కేటీఆర్‌

జనవరి లోగా హైద్రాబాద్‌లో గోడలపై రాతలను తుడిచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ అంశాన్ని మేయర్, పోలీస్ కమిషనర్ బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ కళా మేళా కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ , మేయర్ బొంతు రామ్మాహన్ ప్రారంభించారు. రెండు రోజులపాటు తెలంగాణ కళామేళా కొనసాగనుంది. ఇక నుంచి గోడలపై రాతలు రాస్తే కఠిన చర్యలు తప్పవని కేటీఆర్‌ తెలిపారు. గోడలపై రాతలు రాస్తే మా పార్టీ వాళ్లపైనే మొదట కేసులు పెట్టండి అని కేటీఆర్ చెప్పారు. హైద్రాబాద్‌ను సుందర నగరంగా మార్చేందుకు అందరూ సహకరించాలని తెలంగాణ కళామేళాలో మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com