జమ్ముకశ్మీర్లో 300 మంది మిలిటెంట్లు:డి.జి.పి
- November 06, 2016
జమ్ముకశ్మీర్లో ఇప్పటికీ 300 మంది మిలిటెంట్లు చురుగ్గా ఉన్నారని, అశాంతిని రగిల్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర డీజీపీ రాజేంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీతో జరిగిన సమావేశంలో 'సరిహద్దుల వెంట మిలిటెంట్లు ఆందోళన కలిగించే పనిలో ఉన్నారని, దాని వల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుందని' డీజీపీ ఆమెకు వివరించారు. నాలుగు నెలల క్రితం హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్వానినీ హతమార్చాక, రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.
సీఎంతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాదాపు 250-300 మంది వరకు మిలిటెంట్ల కదలికలు చురుగ్గా ఉన్నాయని, వారి కదలికలు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని డీజీపీ తెలిపారు.
వారు ఇప్పటికే కశ్మీర్ లోయలో 70 భవనాలను తగులబెట్టారని, వాటిలో 53 భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. మిలిటెంట్లుకు వ్యతిరేకంగా పోలీసుల చర్యలు జరుగుతున్నాయని డీజీపీ వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







