జమ్ముకశ్మీర్లో 300 మంది మిలిటెంట్లు:డి.జి.పి
- November 06, 2016
జమ్ముకశ్మీర్లో ఇప్పటికీ 300 మంది మిలిటెంట్లు చురుగ్గా ఉన్నారని, అశాంతిని రగిల్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర డీజీపీ రాజేంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీతో జరిగిన సమావేశంలో 'సరిహద్దుల వెంట మిలిటెంట్లు ఆందోళన కలిగించే పనిలో ఉన్నారని, దాని వల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుందని' డీజీపీ ఆమెకు వివరించారు. నాలుగు నెలల క్రితం హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్వానినీ హతమార్చాక, రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.
సీఎంతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాదాపు 250-300 మంది వరకు మిలిటెంట్ల కదలికలు చురుగ్గా ఉన్నాయని, వారి కదలికలు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని డీజీపీ తెలిపారు.
వారు ఇప్పటికే కశ్మీర్ లోయలో 70 భవనాలను తగులబెట్టారని, వాటిలో 53 భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. మిలిటెంట్లుకు వ్యతిరేకంగా పోలీసుల చర్యలు జరుగుతున్నాయని డీజీపీ వివరించారు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









