జమ్ముకశ్మీర్లో 300 మంది మిలిటెంట్లు:డి.జి.పి
- November 06, 2016
జమ్ముకశ్మీర్లో ఇప్పటికీ 300 మంది మిలిటెంట్లు చురుగ్గా ఉన్నారని, అశాంతిని రగిల్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర డీజీపీ రాజేంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీతో జరిగిన సమావేశంలో 'సరిహద్దుల వెంట మిలిటెంట్లు ఆందోళన కలిగించే పనిలో ఉన్నారని, దాని వల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుందని' డీజీపీ ఆమెకు వివరించారు. నాలుగు నెలల క్రితం హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్వానినీ హతమార్చాక, రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.
సీఎంతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాదాపు 250-300 మంది వరకు మిలిటెంట్ల కదలికలు చురుగ్గా ఉన్నాయని, వారి కదలికలు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని డీజీపీ తెలిపారు.
వారు ఇప్పటికే కశ్మీర్ లోయలో 70 భవనాలను తగులబెట్టారని, వాటిలో 53 భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. మిలిటెంట్లుకు వ్యతిరేకంగా పోలీసుల చర్యలు జరుగుతున్నాయని డీజీపీ వివరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









