యువ దర్శకులతోనే ఎన్టీఆర్ కొత్త సినిమా..!
- November 06, 2016
ప్రతిభ ఎవరి సొత్తూ కాదు. ఎవరిలో ఎంత సత్తా ఉందో తెలియదు. పరిశీలించి అన్వేషిస్తే ఆ ప్రతిభ దొరుకుతుంది. ప్రస్తుతం ఈ టాలెంట్ ను వెతికే పనిలో పడ్డాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిన్నటిదాకా.పేరున్న దర్శకులు, అప్పుడే సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్లతో సినిమాలు చేసిన ఎన్టీఆర్.ఇప్పుడు తన ఆలోచనా ధోరణి మార్చుకున్నాడు. పెద్ద దర్శకులతో విసిగిపోయిన ఈ స్టార్..యువ దర్శకుల ప్రతిభను పరీక్షించాలని భావిస్తున్నాడు.'జనతా గ్యారేజ్' తో వంద కోట్ల క్లబ్ లో చేరినా.ఇలాంటి లెక్కలు వేసుకోకుండా తన కొత్త సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే పటాస్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, 'ప్రేమమ్' దర్శకుడు చందూ మొండేటితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి నిర్మాత దిల్ రాజుతో కలిసి హీరో రామ్ కు ఓ కథ వినిపించారు. ఈ కథలో హీరో గుడ్డివాడు. ఇదొక ప్రయోగాత్మక చిత్రమవుతుంది అంతా అనుకున్నారు. తీరా ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఆ కథనే ఎన్టీఆర్ కు చెబితే.ఇప్పుడున్న ఇమేజ్ కు సరికాదని, మరో కథ చేసుకు రమ్మని పురమాయించాడు. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఈ కథ తయారీలోనే ఉన్నాడు. మరోవైపు చందూ మొండేటి ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లాడట. ఈ స్టోరీకి కూడా యంగ్ టైగర్ సానుకూలంగానే ఉన్నాడు. ఈ ఇద్దరు యువ దర్శకులతోనే ఎన్టీఆర్ కొత్త సినిమా ఉండబోతోంది. ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఉన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత పూరీ జగన్నాథ్ తో ఈ స్టార్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇజం ఫలితం నేపథ్యంలో పూరీ పట్ల ఆయన ఆసక్తి తగ్గిపోయింది. అటు త్రివిక్రమ్ సినిమా చేస్తాడనుకున్నా.పవన్ కళ్యాణ్ తో చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా పూర్తవ్వాలంటే ఏడాది కావాలి. ఎన్టీఆర్ వీవీ వినాయక్ తో 'అదుర్స్ 2' ను మరో ఆప్షన్ గా పెట్టుకున్నా.వినాయక్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి అది పూర్తయినా.కథ సిద్ధం కావాలంటే మరో ఆర్నెళ్లు కావాలి. ఇంత సమయం సినిమా చేయకుండా ఉండటం ఎన్టీఆర్ కు ఇష్టం లేదు. అందుకే యువ దర్శకులైనా తన స్థాయికి తగిన సినిమా చేస్తారేమో అని ఆశలు పెట్టుకున్నాడు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







