బన్నీతో మూవీ డైరెక్ట్ చేయాలని తన డ్రీమ్‌గా పెట్టుకున్నాహరీష్ శంకర్..

- November 07, 2016 , by Maagulf
బన్నీతో మూవీ డైరెక్ట్ చేయాలని తన డ్రీమ్‌గా పెట్టుకున్నాహరీష్ శంకర్..

'సరైనోడు' సూపర్ హిట్ తరువాత అల్లు అర్జున్ చేస్తున్న మూవీ 'డీజే..దువ్వాడ జగన్నాథం'. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. 'గబ్బర్ సింగ్'తో పవన్ కళ్యాణ్ రేంజ్‌కి తగ్గ పవర్‌ఫుల్ హిట్ ఇచ్చాడు హరీష్. ఇప్పుడు బన్నీతో చేస్తున్న 'డీజే' మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అంటున్నాడు. బన్నీతో మూవీ తీయాలని పన్నెండేళ్ల నుండి కల కంటున్నాడట.'ఆర్య' మూవీలో బన్నీ పెర్ఫార్మెన్స్ చూసి ఫ్లాట్ అయిపోయాడట హరీష్. ఆ మూవీలో బన్నీ డాన్స్.. యాక్టింగ్ స్కిల్స్‌కి ఫిదా అయ్యాడట. అందుకే.. అప్పుడే బన్నీతో మూవీ డైరెక్ట్ చేయాలని తన డ్రీమ్‌గా పెట్టుకున్నాడట.అప్పటి తన కల ఇప్పుడు దిల్ రాజు ఇచ్చిన అవకాశంతో 'డీజే..దువ్వాడ జగన్నాథం' డైరెక్టర్‌గా తీరుతుందని అంటున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న 'డీజే' మూవీలో పూజా హెగ్డేతో ఫస్ట్ టైం జతకడుతున్నాడు బన్నీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com