సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్న మూవీకి 150 కోట్ల బడ్జెట్...
- November 07, 2016
'బాహుబలి' మూవీతో ప్రభాస్కి ఆలిండియా అంతా క్రేజ్ వచ్చింది. బాలీవుడ్లో కూడా ప్రభాస్తో డైరెక్ట్ మూవీ చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ మూవీతో ప్రభాస్ మార్కెట్ కూడా పెరిగింది. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్లో కూడా ప్రభాస్కి మర్కెట్ క్రియేట్ అయ్యింది. అందుకే.. 'బాహుబలి-2' తరువాత సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్న మూవీకి 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. 'మిర్చి' లాంటి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది.ఈ మూవీ కోసం దుబాయ్లో ఓ ఛేజింగ్ ఫైట్ డిజైన్ చేసాడట డైరెక్టర్ సుజిత్.
అయితే.. ఆ ఒక్క ఛేజింగ్ ఫైట్కే దాదాపు 40 కోట్ల వరకూ ఖర్చుపెట్టడాని రెడీ అయ్యాడట ప్రభాస్. ఆ ఫైట్ కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్ను తీసుకొస్తారట. అయితే ఇదే హాలీవుడ్ టెక్నీషియన్ని రజనీకాంత్ 'రోబో-2' కోసం తీసుకురావాలనుకున్నాడట శంకర్.
కానీ.. అతని రెమ్యునరేషన్కు భయపడి వెనక్కుతగ్గాడట. కానీ.. ప్రభాస్ కోసం ఎంత ఖర్చు పెట్టి అయినా ఆ టెక్నీషియన్తోనే ఛేజింగ్ ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యారట ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







