అపరిశుభ్రత: మసాజ్ పార్లర్లకు జరీమానా
- November 07, 2016
దుబాయ్: పెద్ద సంఖ్యలో మసాజ్ సెంటర్స్, దుబాయ్ మునిసిపాలిటీ పరిధిలో జరీమానాకి గురయ్యాయి. నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యల్ని దుబాయ్ మునిసిపాలిటీ తీసుకుంది. 330 జరీమానాల విలువ మొత్తం 749,000 దిర్హామ్లుగా అధికారులు వెల్లడించారు. పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. మొత్తం 930 తనిఖీలు ఈ ఏడాది ఇప్పటిదాకా జరిగాయి. జరీమానాలకు తోడు 561 వార్నింగ్స్ కూడా ఇచ్చారు అధికారులు. అపరిశుభ్రతే ఈ ఉల్లంఘనల్లో ముఖ్యమైనదని హెల్త్ కంట్రోల్ సెక్షన్ హెడ్ హఫిద్ గులూమ్ చెప్పారు. ఫిజియోథెరపీ, ఇతర మెడికల్ సర్వీసులు నిర్వహించడం ప్రధాన ఉల్లంఘన. మసాజ్ సెంటర్లు ఎలాంటి మెడికల్ సర్వీసులను అందించడానికి వీల్లేదని గులూమ్ వివరించారు. సాధారణ పరిశుభ్రత లేని మసాజ్ పార్లర్లకు 400 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. ప్లంబింగ్, డ్రైనేజ్ వంటి సమస్యలున్న పార్లర్లకు 1000 దిర్హామ్ల జరీమానా విధించారు. బ్యూటీ సెలూన్ కూడా మసాజ్ సెంటర్లా పనిచేయకూడదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







