అపరిశుభ్రత: మసాజ్ పార్లర్లకు జరీమానా
- November 07, 2016
దుబాయ్: పెద్ద సంఖ్యలో మసాజ్ సెంటర్స్, దుబాయ్ మునిసిపాలిటీ పరిధిలో జరీమానాకి గురయ్యాయి. నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యల్ని దుబాయ్ మునిసిపాలిటీ తీసుకుంది. 330 జరీమానాల విలువ మొత్తం 749,000 దిర్హామ్లుగా అధికారులు వెల్లడించారు. పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. మొత్తం 930 తనిఖీలు ఈ ఏడాది ఇప్పటిదాకా జరిగాయి. జరీమానాలకు తోడు 561 వార్నింగ్స్ కూడా ఇచ్చారు అధికారులు. అపరిశుభ్రతే ఈ ఉల్లంఘనల్లో ముఖ్యమైనదని హెల్త్ కంట్రోల్ సెక్షన్ హెడ్ హఫిద్ గులూమ్ చెప్పారు. ఫిజియోథెరపీ, ఇతర మెడికల్ సర్వీసులు నిర్వహించడం ప్రధాన ఉల్లంఘన. మసాజ్ సెంటర్లు ఎలాంటి మెడికల్ సర్వీసులను అందించడానికి వీల్లేదని గులూమ్ వివరించారు. సాధారణ పరిశుభ్రత లేని మసాజ్ పార్లర్లకు 400 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. ప్లంబింగ్, డ్రైనేజ్ వంటి సమస్యలున్న పార్లర్లకు 1000 దిర్హామ్ల జరీమానా విధించారు. బ్యూటీ సెలూన్ కూడా మసాజ్ సెంటర్లా పనిచేయకూడదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









