అపరిశుభ్రత: మసాజ్ పార్లర్లకు జరీమానా
- November 07, 2016
దుబాయ్: పెద్ద సంఖ్యలో మసాజ్ సెంటర్స్, దుబాయ్ మునిసిపాలిటీ పరిధిలో జరీమానాకి గురయ్యాయి. నిబంధనల్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యల్ని దుబాయ్ మునిసిపాలిటీ తీసుకుంది. 330 జరీమానాల విలువ మొత్తం 749,000 దిర్హామ్లుగా అధికారులు వెల్లడించారు. పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నిర్వహించిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. మొత్తం 930 తనిఖీలు ఈ ఏడాది ఇప్పటిదాకా జరిగాయి. జరీమానాలకు తోడు 561 వార్నింగ్స్ కూడా ఇచ్చారు అధికారులు. అపరిశుభ్రతే ఈ ఉల్లంఘనల్లో ముఖ్యమైనదని హెల్త్ కంట్రోల్ సెక్షన్ హెడ్ హఫిద్ గులూమ్ చెప్పారు. ఫిజియోథెరపీ, ఇతర మెడికల్ సర్వీసులు నిర్వహించడం ప్రధాన ఉల్లంఘన. మసాజ్ సెంటర్లు ఎలాంటి మెడికల్ సర్వీసులను అందించడానికి వీల్లేదని గులూమ్ వివరించారు. సాధారణ పరిశుభ్రత లేని మసాజ్ పార్లర్లకు 400 దిర్హామ్ల జరీమానా విధిస్తారు. ప్లంబింగ్, డ్రైనేజ్ వంటి సమస్యలున్న పార్లర్లకు 1000 దిర్హామ్ల జరీమానా విధించారు. బ్యూటీ సెలూన్ కూడా మసాజ్ సెంటర్లా పనిచేయకూడదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









