భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్లు హ్యాక్
- November 07, 2016
భారత రాయబార కార్యాలయాలకు చెందిన ఏడు వెబ్సైట్లు సోమవారం హ్యాక్ అయ్యాయి. దక్షిణ ఆఫ్రికా, లిబియా, మలావీ, మాలి, ఇటలీ, స్విట్జర్లాండ్, రొమేనియా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. ఈ దేశాల్లో పని చేస్తున్న సుమారు 800 మంది భారత అధికారుల వ్యక్తిగత వివరాల డేటా చోరీ చేసినట్లు నెదర్లాండ్కు చెందిన ఇద్దరు ట్విట్టర్లో పేర్కొన్నారు.
భారతీయ అధికారుల పేర్లు, ఈమెయిల్స్, ఫోన్ నెంబర్లు, పాస్పోర్ట్ నెంబర్లు, వెబ్సైట్ల అడ్మిన్, లాగిన్ వివరాలను పేస్ట్బిన్.కామ్లో బహిర్గతం చేశారు. అయితే ఆ వెబ్సైట్ నిర్వాహకులు ఆ డేటాను తర్వాత తొలగించారు. భారత రాయబార కార్యాలయాల వెబ్సైట్ల సెక్యూరిటీ డొల్లతనాన్ని బయట పెట్టేందుకే తాము హ్యాకింగ్ చేసినట్లు గ్రేహ్యాట్స్గా చెబుతున్న ఇద్దరు వెల్లడించారు.
తాజా వార్తలు
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్









