అస్తమించిన గాంధీ మనవడు

- November 07, 2016 , by Maagulf
అస్తమించిన గాంధీ మనవడు

మహాత్మాగాంధీ మనవడు కానూ రాందాస్ గాంధీ(96) తుదిశ్వాస విడిచారు. గాంధీ మనవడిగా కంటే ఆయన సన్నిహితుడిగానే అందరికీ పరిచయమున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాలుగా సూరత్‌లోని రాధాకృష్ణన్ ఆలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
నాసాశాస్త్రవేత్తగా, అమెరికా రక్షణ శాఖ ఉద్యోగిగా సేవలందించిన ఆయన మెడికల్ రీసెర్చర్ అయిన శివలక్ష్మి(90)ని వివాహం చేసుకున్నారు. ఉప్పు సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆయనకు భార్య తప్ప నా అన్న వారు ఎవరూ లేరు. 40 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న కానూ దంపతులు రెండేళ్ల క్రితం భారత్‌కు తిరిగి వచ్చారు.వీరికి సంతానం లేదు. ఉద్యోగం ద్వారా సంపాదించినది దానధర్మాలకు ఖర్చు చేయడంతో చేతిలో చిల్లిగవ్వలేని దీనస్థితికి చేరుకున్నారు. ఈక్రమంలో అనారోగ్యం పాలైన ఆయన ఆలయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్టోబరు 22న వచ్చిన గుండె పోటు కారణంగా కానూ పక్షవాతానికి గురయ్యారు.

ఫలితంగా ఎడమవైపు శరీర భాగం చచ్చుబడిపోయింది. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com