జయమ్ము నిశ్చయమ్మురా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..

- November 08, 2016 , by Maagulf
జయమ్ము నిశ్చయమ్మురా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..

ఓ చిన్న సినిమా పాజిటివ్ టాక్ తో రిలీజ్ కావడం చాలా అరుదు. కమెడియన్ శ్రీనివాస్ 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రం ఆ అరుదైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో పూర్ణ హీరోయిన్. శివరాజ్ కనుమూరి దర్శకుడు. ఫస్ట్ లుక్ నుంచే ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. ఈ నెల 13న ఆడియో విడుదల కానుండగా. 24న ఈ చిత్రం ప్రేక్షకుల రానుంది.తాజాగా, 'జయమ్ము నిశ్చయమ్మురా' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ని జారీ చేసింది. సెన్సార్ బోర్డ్ ఫీల్ గుడ్ మూవీ చూశామనే కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది.తత్కాల్ ప్రవీణ్ అంటూ కమెడియన్ ప్రవీణ్, అడపా ప్రసాద్ గా కృష్ణ భగవాన్ పాత్రలు చేసిన కామెడీ అద్భుతంగా పండాయట. శ్రీనివాస్ రెడ్డి పాత్రని మలిచిన తీరు చాలా బాగుందంటున్నారు. మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి ఖాతాలో మరో విజయం చేరడం ఖాయమన్నది సెన్సార్ టాక్.
ఈ నెల 13న ఈ చిత్రం ఆడియో కార్యక్రమం జరగనుంది. ఈ ఆడియో వేడుకకి స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నాడట. ఇదే జరిగితే.. ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగిపోవడం ఖాయం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com