మల్టీ స్టారర్ సినిమాలకు ఆదరణ..

- November 08, 2016 , by Maagulf
మల్టీ స్టారర్ సినిమాలకు ఆదరణ..


మల్టీ స్టారర్ సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. జూనియర్, సీనియర్ హీరోలు కూడా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకులు కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. ఇటీవల ఊపిరి, జ్యో అచ్యుతానంద లాంటి మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించగా, తాజాగా ఐదుగురు హీరోలతో ఓ మల్టీ స్టారర్ మూవీకి ప్లాన్ చేశారు. భలే మంచిరోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా ఇందులో నాగ శౌర్య, నారా రోహిత్, సందీప్ కిషన్ లు హీరోలుగా నటించనున్నారట. ఇంక మరో ఇద్దరు హీరోలను వెతికే పనిలో ఉందట యూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన కథ, కథనం కొత్తగా అనిపించడంతో హీరోలు కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోండగా త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com