మల్టీ స్టారర్ సినిమాలకు ఆదరణ..
- November 08, 2016
మల్టీ స్టారర్ సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. జూనియర్, సీనియర్ హీరోలు కూడా కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకులు కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. ఇటీవల ఊపిరి, జ్యో అచ్యుతానంద లాంటి మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి ఆదరణ లభించగా, తాజాగా ఐదుగురు హీరోలతో ఓ మల్టీ స్టారర్ మూవీకి ప్లాన్ చేశారు. భలే మంచిరోజు ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా ఇందులో నాగ శౌర్య, నారా రోహిత్, సందీప్ కిషన్ లు హీరోలుగా నటించనున్నారట. ఇంక మరో ఇద్దరు హీరోలను వెతికే పనిలో ఉందట యూనిట్. ఈ చిత్రానికి సంబంధించిన కథ, కథనం కొత్తగా అనిపించడంతో హీరోలు కూడా ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోండగా త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







