రికార్డు స్థాయిలో అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు..
- November 08, 2016
గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఏడాది అమెరికా ముందస్తు ఓటింగ్ ప్రక్రియలో రికార్డు స్థాయిలో అమెరికన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 46.2 మిలియన్ల మంది 2016 యూఎస్ ఎన్నికల ముందస్తు ఓటింగ్లో పాల్గొన్నారు. 2012లో 32.3 మిలియన్ల మంది మాత్రమే ఈ ముందస్తు ఓటింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది అమెరికన్ల ఓటింగ్ సరళిలో మార్పును సూచిస్తోందని నిపుణులు అంటున్నారు. ఎన్నికల రోజు వరకూ ఆగకుండా ముందుగానే ఓటువేసేయాలని చాలా మంది అనుకున్నట్లు వారు తెలిపారు. దీనివల్ల హిల్లరీ క్లింటన్ లబ్ధి పొందుతారని భావిస్తున్నారు. .ఎన్నికల ప్రాజెక్టు నిర్వహిస్తున్న ముందస్తు ఓటింగ్ నిపుణుడు మైఖేల్ మెక్ డొనాల్డ్ మాట్లాడుతూ ముందస్తు ఓటింగ్లో ఎక్కువ మంది పాల్గొనడం మరో అంశాన్ని కూడా సూచిస్తోందన్నారు.మొత్తమ్మీద పోలింగ్ శాతం పెరగడానికి ఇదో సూచనగా ఆయన పేర్కొన్నారు
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







