పాకిస్తాన్ 20-20 క్రికెట్ లీగ్ కి అతిధ్యమివ్వనున్న ఖతార్

- August 27, 2015 , by Maagulf
పాకిస్తాన్ 20-20 క్రికెట్ లీగ్ కి అతిధ్యమివ్వనున్న ఖతార్

 ఒక చారిత్రాత్మక ప్రారంభానికి చిహ్నంగా, వచ్చే  సంవత్సరం ఫిబ్రవరి లో జరగనున్నమిలియన్ డాలర్ల  పాకిస్తాన్ సూపర్ 20-20 లీగ్ మేచ్ కు అతిధ్యమివ్వడం ద్వారా కతార్ క్రికెట్ కోసం పడిగాపులు పడుతూ ఉన్న అభిమానుల దాహాన్ని తీర్చనుంది. ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లను, వారి ఆటను  కళ్ళారా చూడడానికి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నజమ్ సేథి ఈ మేచ్లు 2016 ఫిబ్రవరి 4 నుండి 24 మధ్య జరగనున్నట్టు ప్రకటించారు. ప్రపంచస్థాయి క్రికెట్ కు అతిధ్యమిచ్చే గల్ఫ్ దేశాల్లో షార్జా మొదటిది కాగా, అనంతరం దుబాయి, అబుధాబీ కూడా ఈ వరుసలో చేరాయి; ఇపుడు దోహా కూడా వాటి సరసన సగర్వంగా నిలచి క్రికెట్ లోకంలో తారగా తళుకులీననుంది!


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com