"హ్యాట్సాఫ్ నరేంద్ర మోదీ జీ. న్యూ ఇండియాకి ఇది శ్రీకారం : రజనీ
- November 09, 2016
దేశంలో బ్లాక్ మనీ ఆటకట్టించడానికి ప్రధాని నరేంద్రమోదీ విప్లవాత్మకమమైన నిర్ణయం తీసుకున్నారు. రూ. 500 రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు మోడీ. దేశంలో బ్లాక్ మనీ నిరోధించేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారాయన. డిసెంబరు 30లోగా రూ.500, రూ.1000నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని సుచించారు మోడీ.ఇప్పుడీ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఇదో సాహస నిర్ణయమని కొనియాడారు ప్రముఖులు, సామాన్య ప్రజలు. బ్లాక్ మనీ,దొంగనోట్లతో అక్రమాలకు పాల్పడేవారి ఆట కట్టించడానికి మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఇది నిజంగా గొప్ప నిర్ణయని, మోదీ దుమ్ము దులిపేశారని సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.తాజగా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం పై సూపర్ స్టార్ రజనీ కాంత్ స్పదించారు. "హ్యాట్సాఫ్ నరేంద్ర మోదీ జీ. న్యూ ఇండియాకి ఇది శ్రీకారం. జైహింద్' అంటూ ట్విట్టర్ లో తన అనందం వ్యక్తం చేశారు రజనీకాంత్.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







