"హ్యాట్సాఫ్‌ నరేంద్ర మోదీ జీ. న్యూ ఇండియాకి ఇది శ్రీకారం : రజనీ

- November 09, 2016 , by Maagulf

దేశంలో బ్లాక్ మనీ ఆటకట్టించడానికి ప్రధాని నరేంద్రమోదీ విప్లవాత్మకమమైన నిర్ణయం తీసుకున్నారు. రూ. 500 రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు మోడీ. దేశంలో బ్లాక్ మనీ నిరోధించేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారాయన. డిసెంబరు 30లోగా రూ.500, రూ.1000నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని సుచించారు మోడీ.ఇప్పుడీ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఇదో సాహస నిర్ణయమని కొనియాడారు ప్రముఖులు, సామాన్య ప్రజలు. బ్లాక్ మనీ,దొంగనోట్లతో అక్రమాలకు పాల్పడేవారి ఆట కట్టించడానికి మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఇది నిజంగా గొప్ప నిర్ణయని, మోదీ దుమ్ము దులిపేశారని సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.తాజగా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం పై సూపర్ స్టార్ రజనీ కాంత్ స్పదించారు. "హ్యాట్సాఫ్‌ నరేంద్ర మోదీ జీ. న్యూ ఇండియాకి ఇది శ్రీకారం. జైహింద్‌' అంటూ ట్విట్టర్ లో తన అనందం వ్యక్తం చేశారు రజనీకాంత్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com