భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను ప్రారంభించిన బాలకృష్ణ
- November 09, 2016
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. బాలకృష్ణ 100వ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్.బి.కె. హెల్పింగ్ హ్యాండ్ జగన్ అండ్ టీమ్ ఆధ్వర్యంలో భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్రను నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని 100 పుణ్య క్షేత్రాల్లో 100 కేజీల కుంకుమార్చనతో పాటు 23 శివలింగాలకు రుద్రాభిషేకం, సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సర్వమత శత పుణ్య క్షేత్ర జైత్రయాత్ర బుధవారం నుంచి ప్రారంభమైంది. కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్లు జెండా వూపి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ చిత్రంలో శ్రేయా, హేమమాలిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 'గౌతమిపుత్ర..' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







