ట్విట్టర్ సంస్థ నుంచి వైదొగుతున్న సీఓఓ ఆడమ్ బైన్..
- November 10, 2016
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థ నుంచి మరో కీలకమైన అధికారి తప్పుకున్నారు. ట్విట్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఆడమ్ బైన్ సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారుల పెరుగుదల కోసం కృషి చేస్తున్న సమయంలో అడ్వర్టైజింగ్ బిజినెస్ బాగా పెంచిన ఆడమ్ ట్విట్టర్ను వీడడం కంపెనీకి ఎదురుదెబ్బే. ఆయన 2010లో ట్విట్టర్లో చేరారు. .ఆయన స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) ఆంటోనీ నోటో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.సీఎఫ్ఓ స్థానంలో కొత్త వ్యక్తిని నియమిమించనున్నట్లు పేర్కొంది. నష్టాల కారణంగా గ్లోబల్ వర్క్ఫోర్స్లో 9శాతం మందిని తొలగిస్తున్నట్లు గత నెలలోనే ట్విట్టర్ ప్రకటించింది. ఇటీవల ట్విట్టర్ ఇండియా హెడ్, మేనేజింగ్ డైరెక్టర్లు కూడా సంస్థ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?









