నోట్లు రద్దుపై సుప్రీంకోర్టులో వచ్చేవారం విచారణ...
- November 10, 2016
దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో వచ్చేవారం విచారణ జరగనుంది. కేంద్రం పెద్దనోట్లు రద్దు చేస్తూ జారీ చేసిన ప్రకటన నిరంకుశంగా ఉందని, ప్రజలకు నోట్ల మార్పిడికి తగినంత సమయం ఇవ్వలేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రకటనను కొట్టివేయడమో, లేక నోట్ల మార్పిడికి తగినంత సమయం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించడమో చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు.
పెద్దనోట్ల రద్దు విషయంపై కేంద్రం కూడా సుప్రీంకోర్టు లో కేవియట్ దాఖలు చేసింది.
తమ వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని, అప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోర్టును కోరింది. మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వీటిని డిసెంబరు 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







