ట్విట్టర్ సంస్థ నుంచి వైదొగుతున్న సీఓఓ ఆడమ్ బైన్..
- November 10, 2016
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థ నుంచి మరో కీలకమైన అధికారి తప్పుకున్నారు. ట్విట్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఆడమ్ బైన్ సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. వినియోగదారుల పెరుగుదల కోసం కృషి చేస్తున్న సమయంలో అడ్వర్టైజింగ్ బిజినెస్ బాగా పెంచిన ఆడమ్ ట్విట్టర్ను వీడడం కంపెనీకి ఎదురుదెబ్బే. ఆయన 2010లో ట్విట్టర్లో చేరారు. .ఆయన స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) ఆంటోనీ నోటో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది.సీఎఫ్ఓ స్థానంలో కొత్త వ్యక్తిని నియమిమించనున్నట్లు పేర్కొంది. నష్టాల కారణంగా గ్లోబల్ వర్క్ఫోర్స్లో 9శాతం మందిని తొలగిస్తున్నట్లు గత నెలలోనే ట్విట్టర్ ప్రకటించింది. ఇటీవల ట్విట్టర్ ఇండియా హెడ్, మేనేజింగ్ డైరెక్టర్లు కూడా సంస్థ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









