విండిస్‌పై భారత మహిళల క్రికెట్‌ జట్టు ఘన విజయం

- November 10, 2016 , by Maagulf
విండిస్‌పై భారత మహిళల క్రికెట్‌ జట్టు ఘన విజయం

భారత మహిళల క్రికెట్‌ జట్టు విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మిథాలీ సేన 39.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. భారత జట్టులో వేదా కృష్ణమూర్తి (52 నాటౌట్‌), మిథాలీ రాజ్‌(46 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. దీప్తి శర్మ (16), స్మృతి మందన(7), మోనా మెష్రమ్‌ (2) పరుగులు చేశారు. విండీస్‌ జట్టులో సెల్‌మాన్‌ 2 వికెట్లు తీయగా మాథ్యూస్‌, ఫ్లెచర్‌లకు చెరో వికెట్‌ దక్కింది.
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ 42.4 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది.విండీస్‌ జట్టులో అగులిరియా 42, మాథ్యూస్‌ 24 టేలర్‌ 19, మినహా మిగిలిన వారెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. భారత బౌలర్లలో ఆర్‌ఎస్‌ గైక్వాడ్‌ 4 వికెట్లు తీయగా, బిస్త్‌ మూడు, పాండే ఒక వికెట్‌ తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com