విండిస్పై భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం
- November 10, 2016
భారత మహిళల క్రికెట్ జట్టు విండీస్తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మిథాలీ సేన 39.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. భారత జట్టులో వేదా కృష్ణమూర్తి (52 నాటౌట్), మిథాలీ రాజ్(46 నాటౌట్) అజేయంగా నిలిచారు. దీప్తి శర్మ (16), స్మృతి మందన(7), మోనా మెష్రమ్ (2) పరుగులు చేశారు. విండీస్ జట్టులో సెల్మాన్ 2 వికెట్లు తీయగా మాథ్యూస్, ఫ్లెచర్లకు చెరో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 42.4 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది.విండీస్ జట్టులో అగులిరియా 42, మాథ్యూస్ 24 టేలర్ 19, మినహా మిగిలిన వారెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. భారత బౌలర్లలో ఆర్ఎస్ గైక్వాడ్ 4 వికెట్లు తీయగా, బిస్త్ మూడు, పాండే ఒక వికెట్ తీశారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







