విండిస్పై భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం
- November 10, 2016
భారత మహిళల క్రికెట్ జట్టు విండీస్తో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మిథాలీ సేన 39.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. భారత జట్టులో వేదా కృష్ణమూర్తి (52 నాటౌట్), మిథాలీ రాజ్(46 నాటౌట్) అజేయంగా నిలిచారు. దీప్తి శర్మ (16), స్మృతి మందన(7), మోనా మెష్రమ్ (2) పరుగులు చేశారు. విండీస్ జట్టులో సెల్మాన్ 2 వికెట్లు తీయగా మాథ్యూస్, ఫ్లెచర్లకు చెరో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 42.4 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది.విండీస్ జట్టులో అగులిరియా 42, మాథ్యూస్ 24 టేలర్ 19, మినహా మిగిలిన వారెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. భారత బౌలర్లలో ఆర్ఎస్ గైక్వాడ్ 4 వికెట్లు తీయగా, బిస్త్ మూడు, పాండే ఒక వికెట్ తీశారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









