పాక్ ఆత్మాహుతిదాడిలో 52కి చేరిన మృతుల సంఖ్య

- November 13, 2016 , by Maagulf
పాక్ ఆత్మాహుతిదాడిలో 52కి చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఆత్మాహతి దాడిలో మృతుల సంఖ్య 52కి చేరుకుంది. లాస్బెలా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న సురాని దర్గా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పద్నాళ్లుగేళ్ల బాలుడు ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. దర్గాలో రోజువారీగా సాయంత్రం నిర్వహించే సంప్రదాయ నృత్య కార్యక్రమం జరుగుతుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారని బలూచిస్థాన్‌ హోంమంత్రి సర్ఫరాజ్‌ బుగ్తీ తెలిపారు. పేలుడు సంభవించిన సమయానికి దర్గాలో దాదాపు 600 మంది ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com