ప్రజల ప్రార్థనల ఫలితంగా పునర్జన్మ--జయలలిత

- November 13, 2016 , by Maagulf
ప్రజల ప్రార్థనల ఫలితంగా పునర్జన్మ--జయలలిత

తమిళనాడు ఉప ఎన్నికల్లో తమ అన్నాడియంకె అభ్యర్థులకు ఓటు వేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రార్థనల ఫలితంగా తాను పునర్జన్మ ఎత్తినట్లు తెలిపారు. ఈ మేరకు జయలిలత చేసిన ప్రకటన ఆదివారం విడుదలైంది.

ఎంజీఆర్ తనను రాజకీయాల్లోకి తెచ్చారని, దాని వల్ల తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని, తన కోసం చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు తాను విన్నానని అంటూ మిమ్మల్ని నేను వదులుకోలేనని అన్నారు.
'మీ ప్రేమను పొందిన నాకు ఏ ప్రమాదం కూడా ముంచుకు రాదు' అని ఆమె అన్నారు. పూర్తిగా కోలుకుని, ప్రజల కోసం తాను పని చేయడానికి నిరీక్షిస్తున్నానని జయలలిత ఆ ప్రకటనలో అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com