గ్యాడ్జెట్స్ వినియోగంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
- November 13, 2016
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చిన్నారులకు కూడా అనేక గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. కొత్త గ్యాడ్జెట్స్ని పిల్లలకు అలవాటు చేయడం అనేది ఓ ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. అయితే ఈ గ్యాడ్జెట్స్ వినియోగం తగ్గించవలసి ఉందని సైకియాట్రిస్ట్లు, పసిపిల్లల మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్ పెంచడం ద్వారా పసిపిల్లల్లో మానసిక ఎదుగుదల ఉంటుందనీ, గ్యాడ్జెట్స్కే వారిని పరిమితం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరించారు. ఖతార్లో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ మోజా అల్ మల్కి మాట్లాడుతూ, టెక్నాలజీ ద్వారా ఎదురయ్యే సానుకూలతలు, వ్యతిరేకతలు తెలుసుకుని తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుందన్నారు. భోజన సమయాల్లో టీవీ చూడకపోవడం, ప్రతిరోజూ కొంత సమయం పాటు మాత్రమే కంప్యూటర్ వినియోగించడం వంటి చర్యలు పెద్దలు పాటిస్తే, తద్వారా పిల్లల్లో కూడా మంచి అలవాట్లు పెరుగుతాయని ఆయన చెప్పారు. ఉమ్ అల్ హయా ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన ముగ్గురు కుమారులు యూ ట్యూబ్కి అలవాటుపడ్డారనీ, అందులో అడల్ట్ కంటెంట్ ఉంటోందని వాపోయారు. వారి వద్దనుంచి స్మార్ట్ ఫోన్స, ల్యాప్టాప్స్ మరియు ఐపాడ్స్ని తీసుకుని, దూరం పెట్టినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







