గ్యాడ్జెట్స్ వినియోగంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
- November 13, 2016
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. చిన్నారులకు కూడా అనేక గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. కొత్త గ్యాడ్జెట్స్ని పిల్లలకు అలవాటు చేయడం అనేది ఓ ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. అయితే ఈ గ్యాడ్జెట్స్ వినియోగం తగ్గించవలసి ఉందని సైకియాట్రిస్ట్లు, పసిపిల్లల మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్ పెంచడం ద్వారా పసిపిల్లల్లో మానసిక ఎదుగుదల ఉంటుందనీ, గ్యాడ్జెట్స్కే వారిని పరిమితం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరించారు. ఖతార్లో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ మోజా అల్ మల్కి మాట్లాడుతూ, టెక్నాలజీ ద్వారా ఎదురయ్యే సానుకూలతలు, వ్యతిరేకతలు తెలుసుకుని తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుందన్నారు. భోజన సమయాల్లో టీవీ చూడకపోవడం, ప్రతిరోజూ కొంత సమయం పాటు మాత్రమే కంప్యూటర్ వినియోగించడం వంటి చర్యలు పెద్దలు పాటిస్తే, తద్వారా పిల్లల్లో కూడా మంచి అలవాట్లు పెరుగుతాయని ఆయన చెప్పారు. ఉమ్ అల్ హయా ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన ముగ్గురు కుమారులు యూ ట్యూబ్కి అలవాటుపడ్డారనీ, అందులో అడల్ట్ కంటెంట్ ఉంటోందని వాపోయారు. వారి వద్దనుంచి స్మార్ట్ ఫోన్స, ల్యాప్టాప్స్ మరియు ఐపాడ్స్ని తీసుకుని, దూరం పెట్టినట్లు వివరించారు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









