నెక్స్ట్ నాలుగు సినిమాలను కలిసి ఒకే సారి ప్రకటన : ఎన్టీఆర్
- November 13, 2016
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ తర్వాత ఇప్పటి వరకూ తన నెక్స్ట్ సినిమా పై క్లారిటీ ఇవ్వలేదు.. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై చాలా వార్తలు వెలువడ్డాయి... కాగా ఎన్టీఆర్ తన సినిమా ప్రకటన ఆలస్యం చేయడానికి గల కారణం అంటూ ఓ వార్త షికారు చేస్తోంది... ఎన్టీఆర్ 27 సినిమాకు దర్శకుడు ఎప్పుడో ఖరారు అయ్యాడని.. కానీ వరస సినిమాలను ప్రకటించాలని భావిస్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కథలు వింటున్నాడని అంటున్నారు.. నెక్స్ట్ నాలుగు సినిమాలను కలిసి ఒకే సారి ప్రకటించాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, చందు మొండేటి వంటి దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. దీంతో నాలుగు సినిమాలకు దర్శకులను.. నిర్మాతలను ఖరారు చేసి తన సినిమాలను ఎన్టీఆర్ స్వయంగా ప్రకటిస్తాడనే టాక్ వినిపిస్తోంది...
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







